దేశంలోని ఇతర రాష్ర్టాలతో పోల్చితే కర్ణాటకలో కరోనా వైరస్ అదుపులోనే ఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యడ్డియూరప్పా అన్నారు. మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ... తర్వలోనే రెడ్ జోన్స్ మినహా మిగతా ప్రాంతాల్లో పరిశ్రమలకు, నిర్మాణరంగ పనులకు అనుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇతర రాష్ర్టాలతో పోల్చినప్పుడు కర్ణాటకలో కరోనా అదుపులోనే ఉంది. కావునా వలస కార్మికుల ప్రయాణాన్ని నిషేధించినట్లు చెప్పారు. వాణిజ్య, నిర్మాణ, పరిశ్రమ కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తామన్నారు. కర్ణాటక ఆరోగ్యశాఖ నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఇప్పటివరకు 659 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. వ్యాధి నుంచి కోలుకుని 324 మంది డిశ్చార్జ్ అయ్యారు. కాగా కోవిడ్-19 కారణంగా 28 మంది మృత్యువాతపడ్డారు.
ఇతర రాష్ర్టాల్లో కంటే ఇక్కడ కరోనా అదుపులోనే ఉంది